paruchuri: 'ఆరెంజ్'లో హీరో హీరోయిన్ల పాత్రలకి అందుకే యూత్ కనెక్ట్ కాలేకపోయింది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఆరెంజ్' కథనంలో వేగం లేదు 
  • హీరోయిన్ ఇంట్రడక్షన్ అలా వుంది
  •  సరైన సమయంలో ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయలేదు

చరణ్ .. జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆరెంజ్' .. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, విదేశాల్లోనే ఎక్కువగా షూటింగు జరుపుకుంది. చరణ్ కెరియర్లో ఆయన అభిమానులను నిరాశపరిచిన చిత్రంగా ఇది నిలిచింది. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ .. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో ప్రస్తావించారు.

"ఈ సినిమా ఏ విషయంతో మొదలవుతుందో .. విశ్రాంతి సమయానికి కూడా అదే విషయం దగ్గర ఉంటుంది. 'ఈ ముగ్గురిలో నేను ఎవరిని లవ్ చేయాలో చీటీ తీయమంటుంది హీరోయిన్ .. అది ఆమె ఇంట్రడక్షన్. ఆల్రెడీ 9 మందిని లవ్ చేసి వదిలేశాడనే హీరో పాత్రతో కథను మొదలుపెట్టాడు. ఈ కారణంగానే అటు హీరోయిన్ పాత్రను అమ్మాయిలు .. చరణ్ పాత్రను అభిమానులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆ రెండు పాత్రలకి కనెక్ట్ కాలేకపోయారు. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ను సరైన సమయంలో రివీల్ చేయకపోవడం కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News