Chandrababu: చివరి వన్ అవర్ గోల్డెన్ అవర్... నేనందరితోనూ మాట్లాడాలి: చంద్రబాబు

  • ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి
  • ఆఖరి రోడ్ షోలో సీఎం భావోద్వేగం
  • తాడికొండలో జనసంద్రం

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఆఖరి రోడ్ షో తాడికొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దగా సమయంలేదని, సాయంత్రం ఐదింటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉందని అన్నారు. ఎన్నికల ప్రచారం చరమాంకంలో చివరి వన్ అవర్ గోల్డెన్ అవర్ అని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదే చివరి సభ అని, మీ ఆశీస్సులు కావాలని, మీ అనుమతితో నిశ్చింతగా వెళతానని చెప్పారు. ఇన్నాళ్ల తన పాలనలో ఎవరికీ ఇబ్బందిలేకుండా చేశానని అన్నారు.

  • Loading...

More Telugu News