Vijay Sai Reddy: 6 నెలలు, 30 సర్వేల్లో వెల్లడైంది ఒకటే నిజం...అను'కుల' మీడియాది మాత్రం దొంగ సర్వేలు!: విజయసాయి రెడ్డి

  • వైసీపీకి 120కి పైగా అసెంబ్లీ సీట్లు
  • 23 లోక్ సభ సీట్లు గ్యారంటీ
  • ఎల్లో మీడియాలో దొంగ సర్వేలు వస్తున్నాయన్న విజయసాయి

ఈ ఎన్నికల్లో గెలవనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా సర్వేల్లో ఇదే వెల్లడైందని, చంద్రబాబు పచ్చ మీడియా మాత్రం దొంగ సర్వేలను వదులుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"జాతీయ మీడియా సర్వేల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ 120 పైగా అసెంబ్లీ స్థానాలు, 23 లోక్ సభ సీట్లు గెలుస్తుందని అనేక సార్లు వెల్లడైంది. 6 నెలలుగా జరిపిన 30కి పైగా సర్వేల్లో ఫలితాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు అను’కుల’ మీడియా చంద్రబాబుదే గెలుపని దొంగ సర్వేలను వదుల్తున్నాయి" అని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News