dk aruna: 16 సీట్లతో చక్రం తిప్పుతానంటున్నారు.. 15 సీట్లతో ఏం చేశారు?: డీకే అరుణ

  • ప్రజలను కేసీఆర్ మాటలతో మభ్యపెడుతున్నారు
  • రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోంది. 
  • సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్ అంటున్నారని... ఇప్పుడు 15 సీట్లు ఉంటే ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్... మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని చెప్పారు. మోదీనీ మరోసారి ప్రధాని  చేయాలనే ఆకాంక్ష అన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. దేశ రక్షణ, సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News