USA: అమెరికాలో తెలుగమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి

  • అదనపు కట్నం కోసం వేధింపులు!
  • గొంతు కోసుకుందంటూ భర్త సమాచారం
  • తొర్రూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తండ్రి

ఇటీవలే తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతి చెందిన ఘటన మరువకముందే ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. ఆమె భర్త శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ టెక్సాస్ లో ఉంటున్నాడు. పెళ్లయిన తర్వాత శ్రీకాంత్ అదనపు కట్నం కోసం సంధ్యను వేధిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీకాంత్ భారత్ లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. గొంతు కోసుకుని బలవన్మరణం చెందిందని తెలిపాడు.

దాంతో సంధ్య తండ్రి మహేందర్ తొర్రూరు పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశారు. మహేందర్ కు ముగ్గురు కుమార్తెలు కాగా, వారిలో సంధ్య చిన్న కుమార్తె. సమీప బంధువు అయిన శ్రీకాంత్ కు ఇచ్చి వివాహం చేశారు. అయితే, ఆర్నెల్లకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. శ్రీకాంత్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా మరింత కట్నం కోసం సంధ్యను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News