advani: ట్విట్టర్ ను ఊపేస్తున్న అద్వానీ!

  • దేశం తర్వాతే పార్టీ అన్న అద్వానీ
  • దేశాన్ని కుదిపేస్తున్న అగ్రనేత వ్యాఖ్యలు
  • ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అద్వానీ హ్యాష్ ట్యాగ్

గత ఐదేళ్లుగా మౌనమునిలా ఉండిపోయిన బీజేపీ అగ్రనేత అద్వానీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. 'మొదట దేశం... తర్వాత పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం' అంటూ తన బ్లాగ్ లో ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని ఊపేస్తున్నాయి. అన్ని పార్టీల నేతలతో పాటు సామాన్యులు కూడా అద్వానీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో దీనిపై భారీ చర్చ కొనసాగుతోంది. ఆయన పేరుతో వచ్చిన హ్యాష్ ట్యాగ్ ఇండియాలో టాప్-3 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ ను ఊపేస్తోంది. ఐదేళ్ల తర్వాత అద్వానీ తన బ్లాగ్ ను వినియోగించడం గమనార్హం.

  • Loading...

More Telugu News