Sharmila: నమాజ్ వినిపించడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన షర్మిల

  • నమాజ్ ముగిసిన తర్వాత ప్రసంగం కొనసాగింపు
  • ఉంగుటూరులో షర్మిల రోడ్ షో
  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన జరిగింది. షర్మిల ప్రసంగం కొనసాగుతుండగా దగ్గర్లో ఉన్న మసీదు నుంచి నమాజ్ వినిపించడంతో ఆమె ఒక్కసారిగా తన ప్రసంగం నిలిపివేశారు. నమాజ్ పూర్తయ్యేవరకు వేచి ఉండి, ఆ తర్వాత ప్రసంగం కొనసాగించారు.

షర్మిల తన ప్రసంగంలో సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని, ఆయన ఏ రోజైతే నిజం చెబుతారో, ఆ రోజున ఆయన తల వెయ్యి వక్కలవుతుందని అన్నారు. వైసీపీకి ఇతర పార్టీలతో పొత్తు అంటకడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News