jagan: జగన్ తన పార్టీని టీఆర్ఎస్ కు అమ్మేశారు: మంత్రి యనమల

  • జగన్ భక్తి మోదీ మీద, చిత్తం సీబీఐ కేసులపైనే
  • జగన్ దృష్టంతా కేసుల మాఫీ, అక్రమాస్తుల రక్షణ మీదే
  • ఇలాంటి జగన్ కి, ఆ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా?

జగన్ భక్తి మోదీ మీద, చిత్తం మాత్రం సీబీఐ కేసుల పైనా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ భక్తి కేసీఆర్ మీద, చిత్తం మాత్రం హైదరాబాద్ లోని తన ఆస్తులపైనా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ దృష్టంతా కేసుల మాఫీ, తన అక్రమాస్తుల రక్షణ మీదే ఉందని, ఇలాంటి జగన్ కి, ఆ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు.

వైసీపీకి ఓటేస్తే మన ప్రాజెక్టులకు మనమే గండికొట్టుకున్నట్టేనని అన్నారు. జగన్ తన పార్టీని టీఆర్ఎస్ కు అమ్మేశారని, కృష్ణా, గోదావరి జలాలను కేసీఆర్ కు తాకట్టు పెట్టారని, వాన్ పిక్, కాకినాడ పోర్టులను కేసీఆర్ కు రాసిచ్చారని ఆరోపించారు. జగన్ వస్తే సాగర్, శ్రీశైలాన్ని కేసీఆర్ కు ధారాదత్తం చేస్తారని అన్నారు. కేసీఆర్ నుంచి రూ. వెయ్యి కోట్లు బయానాగా జగన్ తీసుకున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News