Chandrababu: భార్య ఉన్నా లేనట్టు నటించేవాడ్ని ఏమనాలి?: మోదీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

  • తల్లిని కూడా చూడని వ్యక్తి ఈ మోదీ
  • నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు
  • నరసరావుపేట రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ఎస్ఒఎన్ సన్ అంటూ విమర్శలు చేస్తున్నారని, తనకు భార్య, కొడుకు, కోడలు, ఓ మనవడు కూడా ఉన్నాడని, మరి మోదీ కథేంటి? అని ప్రశ్నించారు.

"తల్లిని చూడరు. భార్యను పట్టించుకోరు. పదవీ వ్యామోహం తప్ప మరో ధ్యాసలేదు. భార్య ఉన్నా లేనట్టు నటించేవాడ్ని ఏమనాలి? తల్లిని చూసుకోవడం తెలియదు కానీ, చెన్నైలో ఉండే కరుణానిధిని ఢిల్లీ తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటాడట. అంతా రాజకీయాలు, అన్నీ నాటకాలు! రాజధాని కట్టుకుంటామంటే, యమునా నది నుంచి నీళ్లు తెచ్చాను, పార్లమెంటు నుంచి మట్టి తెచ్చాను, మీ మొహాన కొట్టాను అంటూ వెళ్లిపోయారు. నేను ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూశాను కానీ, మోదీ, కేసీఆర్, జగన్ లాంటి మనుషుల్ని ఎక్కడా చూడలేదు. వీళ్లంతా చిత్రమైన నాయకులు. విలువల్లేని వ్యక్తులు వీళ్లు. ఇలాంటి సమయంలో రాష్ట్రం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం విడిపోతే భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి. కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడ్డుపడతాడు, పోలవరం ప్రాజక్ట్ కట్టనివ్వడు" అంటూ ప్రసంగించారు.

  • Loading...

More Telugu News