modi: మోదీని డిల్లీ నుంచి గుజరాత్ పంపే వరకూ వదిలిపెట్టను: 'సీఎం చంద్రబాబు

  • గోద్రా ఘటనకు కారకుడు మోదీ
  • నరేంద్ర మోదీ ఉగ్రవాదితో సమానం
  • ప్రపంచ దేశాలు మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది

మోదీని డిల్లీ నుంచి గుజరాత్  పంపించే వరకూ వదిలిపెట్టనని ఏపీ సీఎం చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఉగ్రవాదితో సమానమని, నాటి గోద్రా అల్లర్లలో రెండు వేల మంది మృతికి కారకుడు మోదీనే అని తీవ్ర ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News