Pawan Kalyan: ​ పవన్ పెదబాబు, చినబాబులపై ఒక్క మాట కూడా మాట్లాడ్డంలేదు ఎందుకో చెప్పాలి?: జీవీఎల్

  • పవన్ కల్యాణ్ కాదు... 'ప్యాకేజీ కల్యాణ్'!
  • నిజజీవితంలో కూడా నటిస్తున్నారు
  • ఇకనైనా నాటకాలు కట్టిపెట్టాలి

బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ తన ఎన్నికల ప్రచారంలో మంగళగిరి వైపు అడుగు కూడా పెట్టకపోవడం ఎందుకో చెప్పాలని నిలదీశారు. పవన్ తన ప్రసంగాల్లో పెదబాబు (చంద్రబాబు), చినబాబు (నారా లోకేశ్)లపై ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించినట్టుగానే బయట కూడా నటిస్తున్నారని, రాజకీయాలకు అది సరిపడదని హితవు పలికారు. ఇకనైనా నాటకాలు కట్టిపెడితే మంచిదని జీవీఎల్ అన్నారు. పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ కల్యాణ్ అని ఎందుకు అనకూడదో చెప్పాలని అడిగారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకపోవడం పవన్ పై విమర్శలకు కారణమవుతోంది. సరిగ్గా ఈ పాయింట్ పైనే జీవీఎల్ పవన్ ను టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా జీవిఎల్ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు తనను పట్టించుకోకపోవడంతోనే సీఎం జాతీయ నేతలను తీసుకువచ్చి ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గంటలు గంటలు సోది మాట్లాడుతున్నారని, త్వరలోనే టీడీపీ తెరమరుగైపోతుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News