Police: చెరువులో తేలిన నటి శవం... చత్తీస్ గఢ్ లో కలకలం!

  • హత్యగా భావిస్తున్న పోలీసులు
  • స్థానికులు గుర్తించడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
  • కుమార్తె శవాన్ని గుర్తించిన నటి తల్లి

చత్తీస్ గఢ్ లో  నటిగా, మోడల్ గా ఎదుగుతున్న ఆంచల్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలింది. రాయ్ పూర్ సమీపంలోని ఓ చెరువులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో, వారు నటి మృతదేహాన్ని వెలికి తీశారు. మొదట ఆమె ఎవరో గుర్తించలేకపోయారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో ఆంచల్ తల్లి వెంటనే స్పందించి అది తన కుమార్తె శవమేనని చెప్పింది. దుండగులు ఆంచల్ ను దారుణంగా హతమార్చి ఆపై శవానికి పెద్ద రాయి కట్టి నీటిలో వదిలేశారు.

గత సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్ పై ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడిందని, ఆ తర్వాత మళ్లీ ఆమెను చూడనేలేదని తల్లి వివరించారు. ఆంచల్ వంటిపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. గతంలో ఆంచల్ కు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవని, అప్పట్లో ఓ వీడియోతో అతడిని బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు ఆంచల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News