Balakrishna: సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో బాలకృష్ణ దంపతుల పూజలు... కొత్త పార్టీల ప్రభావం ఉండదంటూ పెదవి విరుపు

  • హత్యారాజకీయాలు వైసీపీకి అలవాటే
  • అభివృద్దే నన్ను గెలిపిస్తుంది
  • నేడు బాలయ్య నామినేషన్

సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు టీడీపీ అధినాయకత్వం మరోసారి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన అర్ధాంగి వసుంధరతో కలిసి హిందూపురం సూగూరు ఆంజనేయస్వామి ఆలయానికి విచ్చేసిన బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందని అన్నారు. కొత్తగా వచ్చే పార్టీలు రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చంటూ పరోక్షంగా జనసేనపై వ్యాఖ్యలు చేశారు. వైసీపీపైనా తన అభిప్రాయాలు తెలుపుతూ, హత్యారాజకీయాలు చేయడం ఆ పార్టీకి అలవాటేనని పేర్కొన్నారు. టీడీపీకి కాకుండా ఇతర ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీకే లాభమని బాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News