Odisha: ఇప్పటికీ అంబాసిడర్ కారును వాడుతున్న ముఖ్యమంత్రి ఈయనే!

  • ఆస్తులు వెల్లడించిన ఒడిశా సీఎం
  • ఆయన కారు విలువ రూ.9,000
  • ఐదేళ్లలో పెరిగిన ఆస్తుల విలువ

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికీ పాతకాలపు అంబాసిడర్ కారునే వాడతారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఒకప్పుడు అంబాసిడర్ కారు రాజకీయ, అధికార వర్గాల్లో రారాజై వెలిగింది. కాలక్రమంలో ఇతర కార్లతో పోటీపడలేక వెనుకబడిపోయింది. అయితే, నవీన్ పట్నాయక్ వంటివాళ్లు ఇప్పటికీ అంబాసిడర్ కారును వినియోగిస్తున్నారు. తాజాగా, ఎన్నికల నామినేషన్ సందర్భంగా దాఖలుచేసిన అఫిడవిట్ లో ఈ విషయం పేర్కొన్నారు.

1980ల నాటి  తన కారు ప్రస్తుత విలువను ఆయన రూ.9000 గా చూపించారు. 2000 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వరుసగా ఐదోసారి సీఎం అవ్వాలని కృతనిశ్చయంతో ఉన్న ఆయన అఫిడవిట్ లో తన ఆస్తుల మొత్తం విలువ రూ.63 కోట్లుగా పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. 2014లో నవీన్ పట్నాయక్ తన ఆస్తుల విలువను రూ.12 కోట్లుగా చూపించారు. 

  • Loading...

More Telugu News