ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీతో వైఎస్ సునీతారెడ్డి భేటీ!
- వైఎస్ వివేకా కేసును తప్పుదారి పట్టిస్తున్నారు
- సీఎం వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయి
- ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిగేలా చూడండి
ఈ నేపథ్యంలో సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని సునీత గోపాలకృష్ణ ద్వివేదీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తన తండ్రి హత్య విషయంలో జరుగుతున్న రాద్దాంతాన్ని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ లను ద్వివేదీకి అందజేసినట్లు పేర్కొన్నారు.