దళితులు, ఎస్టీలు మనుషులు కాదా.. కమ్మ కులంలో పుట్టినవాడే మనిషా?: పోసాని కృష్ణమురళి
- చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉంది
- ఎవరైనా కర్మతోనే వెధవ అవుతాడు, కులంతో కాదు
- కమ్మవారే పదవులకు పనికివస్తారా?
‘అంటే ఎస్టీ కులంలో, దళితులుగా పుట్టినవారు మనుషులు కాదా? కమ్మ కులంలో పుట్టినవాడే మనిషా? నువ్వు కమ్మవాడివి కాబట్టి అగ్రవర్ణం వాడివా? ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు. కర్మతో ఎవడైనా వెధవ అవుతాడు తప్ప కులంతో అవ్వడు. ఈ స్పృహ కూడా చంద్రబాబుకు లేదా? అందుకే ఆయనకు కులపిచ్చి ఉందని చెప్పాను’ అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోసాని ప్రదర్శించారు. ఏ ఎమ్మెల్యే అయినా ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు?’ అంటాడా అని ప్రశ్నించారు. రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఓటున్న ప్రతీఒక్కరికీ కావాలని తెలిపారు. దళితులు సర్వీసులకు పనికిరారా? కేవలం కమ్మకులంలో పుట్టినవారే పదవులకు పనికివస్తారా? అని నిలదీశారు.