Posani Krishna Murali: చంద్రబాబుపై నటుడు పోసాని అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం

  • చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ వ్యాఖ్యలు
  • వివరణ ఇవ్వాలంటూ పోసానికి ఈసీ ఆదేశాలు
  • తాను నడవలేని స్థితిలో ఉన్నానంటూ పోసాని లేఖ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం నటుడికి నోటీసులు పంపింది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.  

నోటీసులు అందుకున్న పోసాని వెంటనే స్పందించి లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని పేర్కొన్నారు. నడవలేని స్థితిలో ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని లేఖలో పోసాని పేర్కొన్నారు.  

Posani Krishna Murali
Chandrababu
Telugudesam
Actor
EC
YSRCP
  • Loading...

More Telugu News