Social Media: గూగుల్ కు రూ.11,000 కోట్లు జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్

  • ప్రత్యర్థుల యాడ్స్ అడ్డుకుంటోందంటూ ఫిర్యాదులు
  • కఠినచర్యలు తీసుకున్న ఈయూ
  • గూగుల్ ది గుత్తాధిపత్య ధోరణి అంటూ విమర్శలు

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) భారీ జరిమానా వడ్డించింది. తన సెర్చ్ ఇంజిన్ లో ప్రత్యర్థుల యాడ్స్ బ్లాక్ చేస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణ జరిపిన ఈయూ తాజా నిర్ణయం తీసుకుంది. గూగుల్ రూ.11,000 కోట్ల జరిమానా చెల్లించాలని ఈయూ వర్గాలు పేర్కొన్నాయి. గత రెండేళ్లలో ఈయూ చేతిలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఎదుర్కొన్న మూడో అతిపెద్ద జరిమానా ఇది.

దీనిపై యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషనర్ మార్ గ్రెతే వెస్టాగర్ మాట్లాడుతూ, ఆన్ లైన్ సెర్చ్ వాణిజ్య ప్రకటనల రంగంలో గూగుల్ తన స్థానాన్ని ఇప్పటికే తిరుగులేని విధంగా పటిష్ఠం చేసుకుందని, అయితే, థర్డ్ పార్టీ వెబ్ సైట్ల నుంచి ఎదురయ్యే పోటీనుంచి తనను తాను రక్షించుకోవడానికి కఠిన ఆంక్షలను కవచంగా మార్చుకుంటోందని వివరించారు. గతేడాది కూడా ఇదే విషయమై ఈయూ గూగుల్ పై 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించింది. అంతకుముందు, 2017లో 2.42 యూరోల జరిమానా వడ్డించారు.

  • Loading...

More Telugu News