Telangana: టీఆర్ఎస్ లో చేరిన ఆరేపల్లి మోహన్..పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్

  • సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్ లో చేరాను
  • ‘బంగారు తెలంగాణ’ సాధనకు నా వంతు కృషి చేస్తా
  • ‘కాంగ్రెస్’పై ప్రజల నమ్మకం తగ్గిపోతోంది

టీ- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ ఆ పార్టీని వీడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో ఆరేపల్లి చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ని కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, ఆరేపల్లి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసే ఆ పార్టీలో చేరానని అన్నారు. ‘బంగారు తెలంగాణ’ సాధనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News