Pawan Kalyan: జనసేన మేనిఫెస్టో హైలైట్స్

  • రైతులకు రూ.8 వేలు సాగు సాయం, రూ.5 వేలు పెన్షన్ 
  • పీజీ వరకు చదువు ఫ్రీ
  • విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు

పవన్ కల్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని జనసేన మేనిఫెస్టో రూపొందించినట్టు అర్థమవుతోంది. అంతేకాకుండా, మహిళలు, విద్యార్థులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు

  • రైతు రక్షక భరోసా పథకంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల రైతులకు నెలకు రూ.5,000 పింఛను
  • రైతుకు ఎకరానికి రూ.8000 సాగు సాయం
  • భూములు కోల్పోయిన కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపు
  • రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు
  • రాష్ట్ర పారిశ్రామికీకరణలో రైతులకు భాగస్వామ్యం
  • తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోసం రూ.5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు
  • ప్రతి మండలంలో గోడౌన్లు
  • ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం
  • విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ పేరుతో భోజన క్యాంటీన్లు
  • ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజక్ట్ సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు
  • ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానంపై ప్రత్యేక ఏర్పాట్లు
  • లంచాలు తీసుకునే వీల్లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
  • అనేక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏడాదికి ఒక్కసారి ఫీజు కట్టించుకునే విధానం
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు
  • మహిళలకు పావలా వడ్డీతో రుణాలు అందజేత
  • ప్రతి జిల్లాలో మహిళలకు ఆసుపత్రి, ప్రత్యేక బ్యాంకు
  • డ్వాక్రా మహిళలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
  • ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
  • బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింపు
  • ముస్లిం సోదరుల కోసం సచార్ కమిషన్ సిఫార్సులు అమలు

  • Loading...

More Telugu News