YSRCP: పార్టీ క్యాడర్ ను అలర్ట్ చేసిన వైఎస్ జగన్!

  • ఓటరు నమోదుకు రేపటితో ముగియనున్న గడువు
  • తుది సమరానికి సిద్ధం కండి
  • ట్విట్టర్ లో క్యాడర్ తో వైఎస్ జగన్

మరో నాలుగు వారాల్లో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను వైఎస్ జగన్ అలర్ట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ ను ఉంచారు. ఎన్నికల తుదిసమరానికి సిద్ధం కావాలని కోరారు.

"వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవల్‌ క్యాడర్‌ అందరికీ... గడచిన నాలుగు సంవత్సరాలుగా మనం ఎంతో శ్రమించాం. ఈ చివరి అడుగుల్లో మరింతగా శ్రమించాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్‌ రోజున ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి. రానున్న 27 రోజుల్లో మీ నుంచి మరింత మద్దతును కోరుతున్నా" అని జగన్‌ ట్వీట్‌ చేశారు.



  • Loading...

More Telugu News