Congress: లోక్ సభ ఎన్నికలకు రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

  • 21 మందితో రెండో జాబితా
  • మొరాదాబాద్ నుంచి రాజ్ బబ్బర్
  • ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ప్రియాదత్

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, మరో 21 మంది పోటీచేసే అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మహారాష్ట్రలో ఐదు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్‌ లో 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సీనియర్ నేత, నటుడు రాజ్ బబ్బర్ మోరాదాబాద్ నుంచి పోటీలో దిగనుండగా, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ తెలిపింది. ప్రియాంక గాంధీకి సన్నిహితుడిగా పేరున్న లలితేశ్ త్రిపాఠి మీర్జాపూర్ నుంచి బరిలోకి దిగనున్నాడు.



  • Loading...

More Telugu News