Pawan Kalyan: జనసేన నుంచి వచ్చేసిన తొలి జాబితా.. ఎక్కడి నుంచి ఎవరంటే..!

  • బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన పవన్
  • నాలుగు లోక్‌సభ, 32 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ప్రకటన
  • త్వరలోనే రెండో జాబితా

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న ఏపీలోని ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపులో మునిగి తేలుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించగా, చివరి నిమిషంలో జాబితాలో మార్పుచేర్పులతో వైసీపీ బిజీగా ఉంది. పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 32 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతోపాటు లోక్‌సభలో పోటీపడే నలుగురి పేర్లను ప్రకటించారు.

పార్లమెంటు అభ్యర్థులు: డీఎంఆర్ శేఖ‌ర్‌(అమ‌లాపురం), ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ (రాజ‌మండ్రి), గేదెల శ్రీనుబాబు (విశాఖ‌ప‌ట్నం), చింత‌ల పార్ధ‌సార‌థి (అన‌కాప‌ల్లి)

అసెంబ్లీ అభ్యర్థులు: సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌(య‌ల‌మంచిలి), న‌క్కా రాజ‌బాబు (పాయ‌క‌రావుపేట), ప‌సుపులేటి బాల‌రాజు(పాడేరు), ముచ్చా శ్రీనివాస‌రావు (రాజాం), కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు(శ్రీకాకుళం), కోత పూర్ణ‌చంద్ర‌రావు(ప‌లాస‌), బాడ‌న వెంక‌ట‌ జ‌నార్దన్(జ‌నా- ఎచ్చెర్ల‌), లోకం నాగ‌మాధ‌వి (నెల్లిమ‌ర్ల‌), రాజా అశోక్‌బాబు (తుని), కందుల దుర్గేష్‌ ( రాజ‌మండ్రి సిటీ),  రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ ( రాజోలు), పాముల రాజేశ్వ‌రి (పి.గ‌న్న‌వ‌రం), ముత్తా శ‌శిధ‌ర్‌ (కాకినాడ సిటీ), రేలంగి నాగేశ్వ‌ర‌రావు (అన‌ప‌ర్తి), పితాని బాల‌కృష్ణ‌ (ముమ్మిడివ‌రం), వేగుళ్ల లీలాకృష్ణ‌(మండ‌పేట‌), బొలిశెట్టి శ్రీనివాస్‌ (తాడేప‌ల్లిగూడెం), న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌ (ఉంగుటూరు), రెడ్డి అప్ప‌ల‌నాయుడు (ఏలూరు), నాదెండ్ల మ‌నోహ‌ర్‌ (తెనాలి), తోట చంద్ర‌శేఖ‌ర్‌(గుంటూరు వెస్ట్‌), రావెల కిషోర్‌బాబు (ప‌త్తిపాడు), ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌ (వేమూరు), స‌య్య‌ద్‌ జిలానీ(న‌ర‌స‌రావుపేట‌), ప‌సుపులేటి సుధాక‌ర్‌ ( కావ‌లి), చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి (నెల్లూరు రూర‌ల్‌), మ‌ల్లికార్జున‌రావు (ఆదోని ), మ‌ధుసూద‌న్‌రెడ్డి (ధ‌ర్మ‌వ‌రం), ప‌త్తిపాటి కుసుమ‌కుమారి (రాజంపేట‌), బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌ (రైల్వే కోడూరు), బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌ (పుంగ‌నూరు), బండి రామ‌కృష్ణ‌ (మ‌చిలీప‌ట్నం)

  • Loading...

More Telugu News