Police: కోల్ కతాలో 1000 కిలోల పేలుడు పదార్థాలతో వాహనం పట్టివేత... ఇద్దరు అరెస్ట్

  • ఒడిశా నుంచి వస్తున్న వాహనం
  • 27 బస్తాల్లో పొటాషియం నైట్రేట్
  • డ్రైవర్, క్లీనర్ ను విచారిస్తున్న పోలీసులు 

పుల్వామా దాడి ఘటన తర్వాత పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శనివారం కోల్ కతాలోని చిత్రపుర ప్రాంతంలో 1000 కిలోల పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు నిలువరించారు. ఆ వాహనం డ్రైవర్ ను, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి వస్తున్న ఆ వాహనం 24 పరగణాలు జిల్లా దిశగా వెళుతుండగా పోలీసులు పక్కా సమాచారంతో అడ్డగించారు. సరైన వివరాలు లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ వాహనంలో 27 బస్తాల్లో పొటాషియం నైట్రేట్ ఉన్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News