India: బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పరారైన పాక్ డ్రోన్

  • రాజస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
  • డ్రోన్ ను కూల్చేందుకు భారీగా కాల్పులు
  • తృటిలో తప్పించుకున్న పాక్ మానవరహిత విమానం

భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఓ డ్రోన్ భారత్ లో ప్రవేశించగా దాన్ని వాయుసేన కూల్చివేసిన సంఘటన మరువకముందే మరో డ్రోన్ సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించింది. రాజస్థాన్ లోని హిందుమల్ కోట్ సమీపంలో ఉన్న శ్రీగంగానగర్ వద్ద ఈ ఘటన జరిగింది.

భారత గగనతలంలో డ్రోన్ ను గమనించిన బీఎస్ఎఫ్ దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అది పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ అని గమనించి వెంటనే భారీగా కాల్పులు జరిపారు బీఎస్ఎఫ్ జవాన్లు. అయితే, ఆ డ్రోన్ కొద్దిలో తప్పించుకుని మళ్లీ పాక్ తిరిగి వెళ్లింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తమకు తుపాకీ కాల్పుల మోత వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు తెలిపారు. భారత్ లో చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ డ్రోన్ తమ దళాల ధాటికి తోకముడిచిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News