prudhvi: 'యాత్ర' గురించి దిల్ రాజు మినహా ఎవరూ మాట్లాడలేదు: కమెడియన్ పృథ్వీ

  • 'యాత్ర' సినిమా అందుకే తీశారు
  • మంచి సినిమా గురించి మాట్లాడలేదు
  •  ప్రజల్లో అభిమానమే హిట్ చేసింది      

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రాజశేఖర్ రెడ్డి అభిమానులను ఆకట్టుకుంది. తాజా ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

"రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఆయన ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యారు? అనేది ప్రజలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో 'యాత్ర' సినిమాను తీశారు. మమ్ముట్టి ఈ సినిమాలో అద్భుతంగా నటించారు .. సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటి ఈ సినిమాను గురించి ఇండస్త్రీలో దిల్ రాజు మినహా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. దిల్ రాజు .. దిల్ వున్న రాజు అని మేమంటే .. ఆయన కూడా రెడ్డే కదా అంటారు .. అది సంస్కారం కాదు. సినిమా బాగున్నప్పుడు .. బాగుందని ప్రోత్సహించాలి .. బాగోలేకపోతే వదిలేయాలి. ఇలా మౌనంగా ఉండిపోవడమే నాకు నచ్చలేదు .. ప్రజల్లో రాజశేఖర్ రెడ్డిపై గల అభిమానం కారణంగానే ఈ సినిమా హిట్ అయిందనేది నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News