Tirupati: స్పష్టమైన హామీ ఇస్తే సైకిలెక్కేస్తా...తిరుపతి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శంకర్‌రెడ్డి

  • ఆయనను పార్టీలోకి రావాలని కోరుతున్న టీడీపీ
  • చిత్తూరు ఎంపీ, తిరుపతి ఎమ్మెల్యేల రాయబారం
  • రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానన్న కందాటి

తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ లేదా మరో గట్టి హామీ లభిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తిరుపతి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కందాటి శంకర్‌రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. శంకర్‌రెడ్డిని పార్టీలోకి టీడీపీ ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆయనతో రాయబారం నడుపుతోంది. రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన చిత్తూరు పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా శంకర్‌రెడ్డి ప్రస్తావన రావడంతో చంద్రబాబు కూడా పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే సమయంలో అనుచరులు, పార్టీ నాయకులతో సమావేశమైన శంకర్‌రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై చర్చించారు.

తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌, తిరుపతి ఎమ్మెల్యే సుగుణ నిన్న శంకర్‌రెడ్డితో మంతనాలు జరిపారు. అధిష్ఠానం ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా శంకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి తనకు ఇబ్బంది లేదని, కాకుంటే తిరుపతి టికెట్‌ లేదా మరో గట్టి హామీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఏ విషయం తెలియజేస్తే రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News