anasuya: ఉపాసన చేతుల మీదుగా 'కథనం' టీజర్ రిలీజ్

  • సస్పెన్స్ థ్రిల్లర్ గా 'కథనం'
  • స్క్రిప్ట్ రైటర్ గా అనసూయ
  •  త్వరలోనే విడుదల       

అనసూయ ప్రధాన పాత్రగా .. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో 'కథనం' సినిమా నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో పృథ్వీ .. అవసరాల .. వెన్నెల కిషోర్ .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'మహిళా దినోత్సవం' సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి చరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కథాపరంగా అనసూయ స్క్రిప్ట్ రైటర్ .. ఆమె తన స్క్రిప్ట్ లో రాసుకున్నట్టుగానే బయట సంఘటనలు జరుగుతుంటాయి. తాను ఊహించుకుని రాసిన సంఘటనలు నిజంగానే జరుగుతూ ఉండటంతో, ఆమె భయాందోళనలకు లోనవుతూ ఉండటం ఈ టీజర్లో చూపించారు. 'నిర్ణయాలు తీసుకోవలసినవాళ్లు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొంటారు సార్' అనే డైలాగ్ బాగుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News