New Delhi: కారు బానెట్ పై వ్యక్తి ఉన్నా కిలోమీటరు దూరం వరకూ నడుపుకుంటూ వెళ్లిన దుండగుడు

  • ఢిల్లీలో దారుణ ఘటన
  • ఢీకొట్టడమే కాక క్యాబ్ డ్రైవర్ పై జులుం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఓ క్యాబ్ డ్రైవర్ తన కారును మరో వాహనం ఢీకొట్టడంతో ఇదేంటని అడిగిన పాపానికి ఆ వాహన యజమాని ఎంత పని చేశాడో చూడండి! తన కారు బానెట్ పై క్యాబ్ డ్రైవర్ ఉన్నా లెక్కచేయకుండా కిలోమీటరు దూరం అలాగే నడుపుకుంటూ వెళ్లాడు. ఢిల్లీలోని ఇందిరాపురం ప్రాంతంలో వీరభద్రసింగ్ అనే వ్యక్తి తన క్యాబ్ లో వెళుతుండగా రోహన్ మిట్టల్ అనే వ్యాపారి తన కారుతో వెనుక నుంచి ఢీకొట్టాడు. దాంతో తన కారు డ్యామేజ్ అయిందని, నష్టపరిహారం చెల్లించాలని వీరభద్రసింగ్ డిమాండ్ చేశాడు. కానీ రోహన్ మిట్టల్ అక్కడినుంచి ఉడాయించేందుకు ప్రయత్నించగా, వీరభద్రసింగ్ ఆ కారు బానెట్ పై పడుకున్నాడు. దాంతో ఆ వ్యాపారి తన కారును అలాగే ముందుకు దూకించాడు.

సింగ్ ను పడేసేందుకు కారును ఇష్టం వచ్చినట్టు అటూ ఇటూ తిప్పాడు. అయినా సింగ్ గట్టిగా పట్టుకుని బానెట్ కు వేళ్లాడుతూ ఉండిపోయాడు. ఇంతలో ఓ వ్యక్తి తన వాహనాన్ని రోహన్ మిట్టల్ కారుకు అడ్డుగా పెట్టడంతో ఈ దారుణానికి అడ్డుకట్ట పడింది. అనంతరం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగిన దరిమిలా రోహన్ మిట్టల్ పై వీరభద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News