Rajahmandry: 14న రాజమండ్రిలో ‘జనసేన’ ఆవిర్భావ సభ.. అందరికీ ఆహ్వానం: పవన్ కల్యాణ్

  • రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సభ
  • ఈ సభ ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు
  • ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలి

జనసేన పార్టీని 2014 మార్చి 14న స్థాపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు ‘జనసేన’ సమాయత్తమవుతోంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ నిర్వహించనున్నట్టు ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

విశాలమైన ఈ ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తమ ప్రతినిధులు తలమునకలై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సభలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని, అందరికీ ఇదే తన ఆహ్వానమని పేర్కొన్నారు. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పదిహేను మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News