New Delhi: ​ అలా అయితే కేజ్రీవాల్ ఈపాటికి బిన్ లాడెన్ అయ్యుండేవాడు!: ఆప్ రెబెల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా

  • జేఎన్ యూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సభ 
  • 'పుల్వామా'పై దృష్టి మరల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి
  • ఐఐటీల నుంచి కూడా వ్యతిరేక శక్తులొస్తున్నాయి

ఆమ్ ఆద్మీ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడికి పాల్పడిన అదిల్ దార్ పోలీసులు కొట్టిన ఓ చెంపదెబ్బ కారణంగానే ఉగ్రవాదిగా మారాడంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఓ చెంపదెబ్బతో ఎవరైనా ఉగ్రవాదిగా తయారవుతారనుకుంటే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈపాటికి ఒసామా బిన్ లాడెన్ అయ్యుండేవాడని వ్యాఖ్యానించారు.

మంగళవారం నాడు జేఎన్ యూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల సందర్భంగా మూడు సంఘటనల్లో కేజ్రీవాల్ చెంపదెబ్బలు తిన్నారని, మరి ఆయనేం అయిపోవాలంటూ ప్రశ్నించారు. ఆనాడు కేజ్రీవాల్ ను చెంపదెబ్బ కొట్టినవారిలో ఓ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారని గుర్తుచేశారు కపిల్ మిశ్రా. జేఎన్ యూ ప్రాంగణాలు సంఘవిద్రోహ శక్తుల ఉత్పత్తి కేంద్రాలుగా తయారవుతున్నాయని, ఇప్పుడు ఐఐటీలు కూడా వామపక్ష అతివాదులు, నక్సల్స్ కు పుట్టినిల్లుగా తయారవుతున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News