Mahesh Babu: 'మహర్షి' విడుదల తేదీ ఖరారు .. ప్రకటించిన దిల్ రాజు

  • హడావిడిగా రిలీజ్ చేయదలచుకోలేదు
  • ఎన్నికల హడావిడి కూడా వుంది
  • మాకు బాగా కలిసొచ్చే నెల  

మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు .. అశ్వనీదత్ .. నిర్మాతలుగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగా ప్రకటించారు. ఆ తరువాత మే 9వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉందనీ, మహేశ్ బాబును ఒప్పించే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్నారనే టాక్ వచ్చింది.

తాజాగా ఇదే తేదీని ఖరారు చేస్తూ .. దిల్ రాజు ప్రకటన చేశారు. ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ పనులను హడావిడిగా చేయించవలసి ఉంటుంది. ఇంతటి భారీ సినిమాను హడావిడిగా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. పైగా ఏప్రిల్లో ఎన్నికల హడావిడి ఉంటుంది కూడా. అందువల్లనే మహేశ్ బాబుతో కూర్చుని మాట్లాడి, ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాము. ఇక నిర్మాతలుగా అశ్వనీదత్ కి .. నాకు కూడా మే నెల బాగా కలిసొచ్చే నెల" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News