Mahesh Babu: తేడా వచ్చింది కాబట్టే సుకుమార్ తో సినిమా చేయడంలేదు: మహేశ్ బాబు

  • సృజనాత్మక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు
  • 1 నేనొక్కడినే చిత్రం ఓ క్లాసిక్
  • సుకుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్

'భరత్ అనే నేను'తో భారీ హిట్ కొట్టిన మహేశ్ బాబు, 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ నమోదు చేసిన సుకుమార్.. ఇద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తున్నట్టు నిన్నటివరకు విపరీతమైన ప్రచారం జరిగింది. '1 నేనొక్కడినే' చిత్రం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోందని అందరూ భావించేంతలో మహేశ్ బాబు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు రావడంతో సుకుమార్ తో సినిమా చేయడం లేదంటూ ట్వీట్ చేశాడు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆర్య సిరీస్ లో మరో చిత్రం పట్టాలెక్కుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

మహాశివరాత్రి సందర్భంగా ఆర్య సిరీస్ లో మూడో చిత్రం అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో, సుకుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు మహేశ్ బాబు. కొత్త ప్రాజక్ట్ ప్రకటించిన సుకుమార్ కు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఓ అద్భుతమైన ఫిలింమేకర్ గా సుకుమార్ ను ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపాడు. 1నేనొక్కడినే మూవీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుందని, ఆ సినిమాకు పనిచేసిన సమయంలో ప్రతిక్షణం ఎంజాయ్ చేసినట్టు వివరించాడు మహేశ్ బాబు.

  • Loading...

More Telugu News