Andhra Pradesh: ‘డేటా కుంభకోణం’పై విచారణ చేస్తే పిల్లకాకి లోకేశ్ కు భయమెందుకు!: వైసీపీ నేత బొత్స

  • సూత్రధారులు బయటపడతారనే భయపడుతున్నారు
  • ఏ తప్పూ చేయకుంటే విచారణను ఎదుర్కోండి 
  • టీడీపీ అధినేత, లోకేశ్ పై విమర్శలు గుప్పించిన నేత

డేటా దొంగతనం కుంభకోణంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నారా లోకేశ్ ను ఈ సందర్భంగా పిల్లకాకిగా ఆయన అభివర్ణించారు. అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనే లోకేశ్ భయపడుతున్నారని ఆరోపించారు. ఏ తప్పూ చేయకుంటే చంద్రబాబు, లోకేశ్ ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని సవాలు విసిరారు.

ఈరోజు ట్విట్టర్ లో బొత్స స్పందిస్తూ..‘డేటా దొంగతనం స్కాం పై విచారణ చేస్తే.. పిల్లకాకి @naralokesh కి అంత భయమెందుకో? అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనా? ఏ తప్పూ చేయనప్పుడు విచారణను ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా? దొంగతనం చేసి పచ్చిగా పట్టుబడింది కాక దొంగే "దొంగా.. దొంగా" అంటూ తండ్రీకొడుకులు భుజాలు తడుముకుంటున్నారు?’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News