Andhra Pradesh: ఏపీ ప్రజల కల సాకారమైంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రైల్వేజోన్ ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
  • మోదీ, అమిత్ షా, గోయల్ కు ధన్యవాదాలు: జీవీఎల్
  • దశాబ్దాల ఆంధ్రుల కల నెరవేరింది: కన్నా

రైల్వేజోన్ విషయంలో ఏపీ ప్రజల కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకూ తన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.

కాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, దశాబ్దాల ఆంధ్రుల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. రైల్వేజోన్ ప్రకటనపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News