delhi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరశన దీక్ష వాయిదా

  • భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల దీక్ష వాయిదా
  • ఈ పరిస్థితుల్లో దేశం కోసం అందరూ ఐక్యంగా నిలవాలి
  • భారత వైమానిక దళ పైలట్లకు ‘సెల్యూట్’: కేజ్రీవాల్

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష వాయిదా పడింది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే మార్చి1న తాను చేపట్టాల్సిన దీక్షను వాయిదా వేసుకున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో దేశం కోసం అందరూ ఐక్యంగా నిలవాలని అన్నారు. మరో ట్వీట్ లో, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులకు తాము గర్విస్తున్నట్టు చెప్పారు. భారత వైమానిక దళ పైలట్లకు ‘సెల్యూట్’ చేస్తున్నట్టు ప్రకటించారు.


  • Loading...

More Telugu News