Andhra Pradesh: పశ్చిమ గోదావరిలో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకరి దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు!

  • పెదవేగి మండలం వేగివాడ దగ్గర ఘటన
  • కారు నడుపుతున్న ఆదిత్య అక్కడికక్కడే మృతి 
  • గాయపడ్డ వృద్ధురాలు ఆసుపత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలంలోని వేగివాడ గ్రామ సమీపంలో రోడ్డుపై వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు నడుపుతున్న ఆదిత్య(28) అక్కడికక్కడే చనిపోగా, అందులోని వృద్ధురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు పెద్దావిడను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో కారును నడుపుతున్న ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మృతుడి స్వస్థలం దెందులూరు మండలం శ్రీరామవరం అని పేర్కొన్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News