Andhra Pradesh: జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు

- ఒక్క రోజే 220 బయోడేటాల సమర్పణ
- పెద్దాపురం నుంచి టికెట్ ఆశిస్తున్న లక్ష్మణమూర్తి
- ఇప్పటికే ఖరారైన ముమ్మిడివరం అభ్యర్థి పితాని బయోడేటా సమర్పణ
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి ఈ ఒక్క రోజే 220 బయోడేటాలు సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం చిన రాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ) తమ బయోడేటాను సమర్పించారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు.
