payal rajput: 'ఆర్ ఎక్స్ 100' బ్యూటీని అసలు సంప్రదించనేలేదట!

  • సెట్స్ పైకి వెళ్లే దిశగా 'మన్మథుడు 2'
  • పాయల్ ను ఎంపిక చేశారంటూ టాక్
  • మార్చి 12వ తేదీన సినిమా లాంచ్

'ఆర్ ఎక్స్ 100' సినిమాలో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ అందాలను ఆరబోసేసింది. ఆమె అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాయల్ ను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే 'మన్మథుడు 2' సినిమా కోసం పాయల్ ను తీసుకున్నారనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది.

చాలా తక్కువ సమయంలోనే అమ్మడు నాగార్జున సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసిందని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. 'మన్మథుడు 2' సినిమా టీమ్ అసలు ఈ సుందరిని సంప్రదించనే లేదట. ఇప్పటివరకూ జరిగిన ప్రచారం పుకారు మాత్రమేనని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా అనుష్క పేరు వినిపిస్తోంది. అందులో వాస్తవమెంతన్నది చూడాలి. మార్చి 12వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అప్పటికి అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

  • Loading...

More Telugu News