prabhas: రాజమౌళి శిష్యుడితో ప్రభాస్ మూవీ?

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'సాహో'
  • తదుపరి సినిమా రాధాకృష్ణతో 
  • ప్రభాస్ కథపై 'కేజీఎఫ్' దర్శకుడి కసరత్తు      

ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు రెండు సెట్స్ పై వున్నాయి. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చేస్తోన్న ఆయన, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత యువ దర్శకులతోనే చేయడానికి ప్రభాస్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

గతంలో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణ అనే యువకుడు, ఇటీవల ప్రభాస్ కి ఒక కథ చెప్పాడట. ఆ కథ ఆయనకి నచ్చడంతో, యూవీ క్రియేషన్స్ లో నిర్మించాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక కొరటాల శివ .. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన యువకులు కూడా, ప్రభాస్  ను మెప్పించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఎవరెవరికి అవకాశాలు ఇస్తూ వెళతాడో చూడాలి.

  • Loading...

More Telugu News