laya: ఎందుకిలా చేస్తున్నారు? .. ఆవేదన వ్యక్తం చేసిన లయ

  • కొన్నేళ్లుగా వేరే ప్రాంతంలో వుంటున్నాను
  • పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ మీద విమర్శిస్తారా?
  • పద్ధతి మార్చుకోవాలి      

తెలుగు తెరపై నాజూకైన కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన వారిలో 'లయ' ముందు వరుసలో కనిపిస్తుంది. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను మాత్రమే పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వివాహమైన తరువాత నటనవైపు దృష్టి పెట్టని ఆమె, ఇటీవల వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో మెరిసింది.

ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆమె, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఆ మధ్య నేనొక ఇంటర్వ్యూలో మాట్లాడితే నా తెలుగు అస్సలు బాగోలేదంటూ యూట్యూబ్ చానల్స్ లో విమర్శించారు. నా భాష ఎంత మాత్రం బాగోలేదంటూ పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ మీద నన్ను అల్లరి చేశారు. కొన్నేళ్లుగా వేరే ప్రాంతంలో ఉండటం వలన, భాషలో అక్కడి యాస కనిపిస్తుంది. దానిని తప్పుపడితే ఎలా? సినిమా వేదికలపై ఎంతమంది అచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసే పైత్యం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది .. ఈ పధ్ధతిని మార్చుకోవాలి" అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News