ntr: రాజమౌళి మల్టీ స్టారర్ నుంచి ముందుగా రానున్న చరణ్ ఫస్టులుక్

  • 'రామరాజు' పాత్రలో చరణ్ 
  • ఒక కథానాయికగా అలియా భట్
  • వచ్చే 27వ తేదీన ఫస్టులుక్    

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ఎన్టీఆర్ బందిపోటుగా .. చరణ్ 'రామరాజు' అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం ముగ్గురు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా అలియా భట్ ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రాలేదు. ఎన్టీఆర్ .. చరణ్ లలో ఎవరి ఫస్టులుక్ ముందుగా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫస్టులుక్ ముందుగా రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫస్టులుక్ ను వదలనున్నట్టు సమాచారం. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని 'బాహుబలి' తరహాలోనే ఒక్కో లుక్ ను వదులుకుంటూ వస్తారట.

  • Loading...

More Telugu News