Allu Bhanumathi: జనసేన తీర్థం పుచ్చుకున్న విశాఖ మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి

  • 1985లో ఎమ్మెల్యేగా ఎన్నిక
  • పార్టీలో చేరిన రఘురాజ్, సన్యాసినాయుడు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్

విశాఖపట్టణం మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె మనవడు యర్రా రఘురాజ్, నగర మాజీ కార్పొరేటర్ యర్రా సన్యాసినాయుడు తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 1985లో భానుమతి విశాఖ‌-1 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో భానుమతి తదితరులకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News