congress: త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా: కిశోర్ చంద్రదేవ్

  • ఢిల్లీలో చంద్రబాబుతో ముగిసిన చంద్రదేవ్ భేటీ
  • మర్యాదపూర్వకంగానే చంద్రబాబుని కలిశాను 
  • ఏపీలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు

కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బయటకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని కిశోర్ దేవ్ వీడినప్పటి నుంచి ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

 అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో త్వరలోనే చేరబోతున్నానని, ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే బాబుని కలిసినట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయ పార్టీ లేదని, వచ్చే ఎన్నికల్లో  తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని అన్నారు.

  • Loading...

More Telugu News