Tollywood: ఈ లెజెండ్ గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే.. మమ్ముట్టిపై అనసూయ ప్రశంసల వర్షం!

- సుచరితారెడ్డి పాత్ర నా మనసులో ఎన్నటికీ ఉండిపోతుంది
- నన్ను నమ్మినందుకు దర్శకుడు రాఘవ్ కు కృతజ్ఞతలు
- ట్విట్టర్ లో స్పందించిన అనసూయ భరద్వాజ్
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమాను దర్శకుడు మహి.వి.రాఘవ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గౌరు సుచరితారెడ్డి పాత్రలో అనసూయ నటించింది. యాత్ర సినిమాలో తన పాత్రను అభినందిస్తూ సందేశాలు పంపుతున్న అభిమానులకు అనసూయ కృతజ్ఞతలు తెలిపింది.
ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘యాత్రలో నేను పోషించిన సుచరితారెడ్డి పాత్ర నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ పాత్ర నేను చేయగలనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ సార్ కు, 70mmEntertainsకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది.
