Andhra Pradesh: 14వ వివాహ వార్షికోత్సవం.. ట్విట్టర్ లో రొమాంటిక్ గా స్పందించిన మహేశ్ బాబు!

  • 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత వివాహం
  • నమ్రతకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రిన్స్
  • మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా మహేశ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల వివాహం జరిగి నేటికి సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రిన్స్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అనుకోకుండా ఈ ఫొటోను తీశారు. అప్పుడే పెళ్లయి 14 ఏళ్లు అయిపోయాయి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫొటోను జతచేశారు. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు మహేశ్-నమ్రత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ తీసిన ‘వంశీ’ సినిమాలో నమ్రత తొలిసారి మహేశ్ కు పరిచయమయ్యారు. ఇది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగేళ్ల డేటింగ్ అనంతరం ఈ జంట 2005, ఫిబ్రవరి 10న ముంబైలోని మారియట్ హోటల్ లో పెళ్లి చేసుకుంది. అతడు షూటింగ్ సమయంలో మహేశ్ పెళ్లి జరిగింది.  మహేశ్-నమ్రత దంపతులకు గౌతమ్ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం మహేశ్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘మహర్షి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Andhra Pradesh
Telangana
Tollywood
Mahesh Babu
namrata
marriage
14 th anniversary
Twitter
wishes
  • Loading...

More Telugu News