భారీ కాన్వాయ్ తో జగన్ వద్దకు బయలుదేరిన కోట్ల... వాహనాలు ఢీకొని ముగ్గురి మృతి!
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి
- ఓర్వకల్లు వద్ద అదుపు తప్పిన కాన్వాయ్
- పలువురు కార్యకర్తలకు గాయాలు
కోడుమూరు నుంచి కడపకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి బయలుదేరిన వేళ, ఓర్వకల్లు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.