Krishna District: కృష్ణా జిల్లాలో పోలీసులకు డబ్బు కవర్లు ఇవ్వడానికి ప్రయత్నం.. వైసీపీ నేత అనుచరుడిపై ఆరోపణలు!

  • ఎన్నికలప్పుడు సహకరించాలని నగదు ఇచ్చే యత్నం
  • ఆ నగదు కవర్లను తిరస్కరించిన పోలీస్ అధికారులు
  • నగదు ఇవ్వజూపింది వైసీపీ నేత మాగంటి వెంకట రామారావుగా గుర్తింపు

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో డబ్బు కవర్ల కలకలం చోటుచేసుకుంది. వైసీపీ నేత పోలీసులకు నగదు ఇవ్వజూపారంటూ ఆరోపణలు తలెత్తాయి. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లకు నగదు కవర్లతో ఓ వైసీపీ నేత వెళ్లినట్టు ఆరోపణలు. ఆ నగదు కవర్లను తిరస్కరించిన పోలీస్ అధికారులు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నగదు తీసుకెళ్లిన నేత మాగంటి వెంకట రామారావుగా గురించారు. మైలవరం వైసీపీ నేత కృష్ణ ప్రసాద్ ఈ నగదు పంపారని ఆయన అనుచరుడు రామారావు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వెంకట రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఎన్నికల సమయంలో తమకు సహకరించాలని వెంకటరామారావు ఈ నగదును వారికి ఇవ్వజూపారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

  • Loading...

More Telugu News