mahabubnagar dist: నారాయణపేట జిల్లాలో కోయిల్ కొండను కలపొద్దంటూ ఆందోళన..సీఐ తలకు తీవ్రగాయం!

  • దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా-వార్పు కార్యక్రమం
  • హింసాత్మకంగా మారిన నిరసన ఆందోళన  
  • పోలీసులపై  రాళ్లు రువ్విన ఆందోళనకారులు

మహబూబ్ నగర్ జిల్లాలో కోయిల్ కొండ మండలం ఉంది. ఈ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపొద్దంటూ కోయిల్ కొండ వాసులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్- కోయిల్ కొండ మార్గంలో ఉన్న దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనా కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సీఐ పాండురంగారావు తలకు తీవ్ర గాయమైంది. సీఐను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News