Anantapur District: తోపుదుర్తిలో ఉద్రిక్తత.. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం!

  • డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని నిరసన
  • నల్ల జెండాలు ధరించి ఆందోళన
  • మహిళలను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ ను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు యత్నించారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

నల్ల జెండాలు ధరించి ఆందోళనకు దిగారు. కాన్వాయ్ ను మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. కాగా, డ్వాక్రా మహిళల ఆందోళన కారణంగా యాలేరు గ్రామ శివారులో పరిటాల సునీత గంటకు పైగా వేచి ఉన్నారు. తోపుదుర్తికి సునీత కాన్వాయ్ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. 

Anantapur District
raptadu
topudurthi
dwacra
paritala
sunitha
convoy
  • Loading...

More Telugu News